కరెంట్ షాక్‌తో వ్యక్తి మృతి

by  |
కరెంట్ షాక్‌తో వ్యక్తి మృతి
X

దిశ, నారాయణఖేడ్:
కరెంట్ షాక్‌ తో ఓ వ్యక్తి మరణించిన ఘటన సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలంలో చోటు చేసుకుంది. ఎస్ఐ అబ్దుల్ రఫీక్ తెలిపిన వివరాల ప్రకారం…తడ్కల్ గ్రామానికి చెందిన షేక్ హమీద్(38) అనే యువకుడు గ్రామంలో విద్యుత్ పనులు చేసేవాడు. స్థానికుల అవసరాల కోసం స్తంభాలు ఎక్కడం, విద్యుత్ సమస్యలు పరిష్కరించటం లాంటివి చేస్తుండేవాడు. మంగళవారం కరెంట్ లేని సమయంలో నియంత్రిక వద్ద మరమ్మతులు చేయడానికి వెళ్లాడు. కాగా ఒక్క సారిగా కరెంట్ వచ్చింది. దీంతో అతనికి షాక్ తగిలి అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.



Next Story

Most Viewed