బాలు అంత్యక్రియలకు ప్రజలెవరూ రావొద్దు..

by  |
బాలు అంత్యక్రియలకు ప్రజలెవరూ రావొద్దు..
X

దిశ, వెబ్‌డెస్క్ :

గాన గంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం అంత్యక్రియలకు ప్రజలెవరూ రావొద్దని తిరువళ్లూరు ఎస్పీ అరవింద్ తెలిపారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో బాలు కుటుంబ సభ్యులు, ప్రముఖులు మినహా ఆయన మృతదేహాన్ని చూసేందుకు ఎవరికీ అనుమతి లేదన్నారు.

ఆయన మృతదేహాన్ని చూసేందుకు ఎవరూ రాకుండా ఉండేందుకు ఫాంహౌజ్‌కు 2 కిలో మీటర్ల దూరంలో బారీకేడ్లు ఏర్పాటు చేశామని చెప్పారు. భౌతికకాయం ఉన్న పరిసరాల్లో వాహనాలను కూడా అనుమతించేది లేదని ఎస్పీ అరవింద్ స్పష్టంచేశారు.


Download Dishadaily Android APP

Download Dishadaily IOS APP



Next Story

Most Viewed