శాంతియుతంగా గణేష్ నిమజ్జనాలు.!

by  |
శాంతియుతంగా గణేష్ నిమజ్జనాలు.!
X

నిర్మల్ జిల్లా కేంద్రంలో వినాయక నిమజ్జన ఉత్సవాలు శాంతియుతంగా ప్రారంభమయ్యాయి. పట్టణంలోని బుధవార్‎పేట్‎లోని గణనాథులకు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల్ల ఇంద్రకరణ్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ముషర్రఫ్ ఫారూఖీ పూజా కార్యక్రమాలు నిర్వహించి నిమజ్జనాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ.. కరోనా వ్యాప్తి దృష్ట్యా ఈ ఏడాది గణేష్ నిమజ్జనం నిరాడంబరంగా జరుపుకుంటున్నామని అన్నారు. ప్రతి ఒక్కరూ నిమజ్జనాన్ని శాంతియుతంగా జరుపుకోవాలని సూచించారు.



Next Story

Most Viewed