హైదరాబాద్‌లో పీడీఐ కార్యాలయం ప్రారంభం

by  |
హైదరాబాద్‌లో పీడీఐ కార్యాలయం ప్రారంభం
X

దిశ, న్యూస్ బ్యూరో: అట్లాంటా కేంద్రంగా ఉన్న అంతర్జాతీయ పీడీఐ సాఫ్ట్వేర్ కంపెనీ హైదరాబాద్ లో కార్యాలయాన్ని తెరిచింది. ప్రపంచ వ్యాప్తంగా ఈఆర్పీ ప్రువైడర్, ఇంధన ధరలు, లాజిస్టిక్ సప్లయి చైన్, మార్కెటింగ్ క్లౌడ్ సొల్యూషన్స్ ను కలిగింది. పెట్రోలియం టోకు వ్యాపార సంస్థలతో సంబంధాలు ఉన్నాయి. ఇంతకు ముందు చెన్నైలో మాత్రమే కార్యాలయం ఉండేది. శుక్రవారం హైదరాబాద్ లో కార్యాలయాన్ని ప్రారంభించింది. ప్రస్తుతం పీడీఐ కార్యాలయంలో 40 మంది సిబ్బంది పని చేస్తున్నారు.

దేశ వ్యాప్తంగా 200 మంది బృందంతో కార్యకలాపాలను నిర్వహిస్తోంది. ఇంజినీరింగ్ వైస్ ప్రెసిడెంట్ రవిశంకర్ మోచర్ల మాట్లాడుతూ.. హైదరాబాద్ ప్రాంతీయ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ మాట్లాడుతూ.. 37 ఏండ్ల పీడీఐ కంపెనీ ఇక్కడికి రావడం సంతోషంగా ఉందన్నారు.


Next Story

Most Viewed