మోడీ, కేసీఆర్‌ రైతులను మోసం చేస్తున్నారు

by  |
మోడీ, కేసీఆర్‌ రైతులను మోసం చేస్తున్నారు
X

దిశ, వెబ్‌డెస్క్: మోడీ, కేసీఆర్ ప్రభుత్వాలు రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నాయని తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి విమర్శించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. మూడు వ్యవసాయ బిల్లులను కేంద్ర ప్రభుత్వం అప్రజాస్వామికంగా ఆమోదించిందని, మోడీ ప్రభుత్వం.. ప్రైవేట్, కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాస్తుందని మండిపడ్డారు. గతంలో బీజేపీ తెచ్చిన చట్టాలకు టీఆర్ఎస్ అనుకూలంగా ఓట్లు వేసిందన్నారు. కాంగ్రెస్ హయాంలో రైతులకు వడ్డీ లేని రుణాలు ఇచ్చామని, ఇప్పుడున్న ప్రభుత్వాలు రైతులను అస్సలు పట్టించుకోవడం లేదని ఫైర్ అయ్యారు. పాస్ పుస్తకాలు ఇవ్వనందునే 10లక్షల మంది రైతులకు రైతుబంధు అందడం లేదన్నారు.



Next Story