మలయాళీ రీమేక్‌లో పవర్ స్టార్

by  |
మలయాళీ రీమేక్‌లో పవర్ స్టార్
X

మలయాళీ హిట్ మూవీ ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’. దివంగత దర్శకుడు సాచి డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపించింది. పృథ్వీ రాజ్, బిజూ మీనన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేసేందుకు సితార ఎంటర్‌టైన్మెంట్స్ సంస్థ రీమేక్ రైట్స్‌ను కొనుగోలు చేసింది.

నందమూరి బాలకృష్ణ, రానా దగ్గుబాటి కలయికలో సినిమా తీయాలని భావించిన నిర్మాత ఆ వైపుగా ప్రయత్నించారు. ఈ ప్రాజెక్ట్‌కు రానా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా.. బాలయ్య మాత్రం ఒప్పుకోలేదు. దీంతో ఆ క్యారెక్టర్ కోసం రవితేజను సంప్రదించారు. కానీ ఆ ప్రయత్నం కూడా సక్సెస్ కాలేదు. దీంతో ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ను ఒప్పించే ప్రయత్నాల్లో ఉన్నారట.

ఈ రీమేక్ బాధ్యతలను సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్‌కు అప్పగించగా.. తనే ఈ క్యారెక్టర్‌లో పవన్‌ను నటింపచేసేందుకు 100% ట్రై చేస్తానని నిర్మాతకు చెప్పారట. కాగా ఇప్పటికే ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ సినిమా చూసిన పవన్ పాజిటివ్‌గా రియాక్ట్ అయినట్లు సమాచారం.



Next Story

Most Viewed