షిప్ యార్డ్‌ ప్రమాదం దిగ్భ్రాంతికరం: పవన్

by  |
షిప్ యార్డ్‌ ప్రమాదం దిగ్భ్రాంతికరం: పవన్
X

దిశ, వెబ్‌డెస్క్: విశాఖ హిందూస్థాన్ షిప్ యార్డ్‌లో జరిగిన ప్రమాదం దిగ్భ్రాంతికరమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ ప్రమాదంలో భారీ క్రేన్ కూలి 11 మంది మృతి చెందారన్న వపన్.. తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యానని చెప్పారు. మృతుల కుటుంబాలకు తన తరఫున, జనసేన తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

కాగా, ఈ ప్రమాదంలో మృతి చెందిన వారిలో అత్యధికంగా కాంట్రాక్టు ఉద్యోగులు ఉన్నారని తమ దృష్టికి వచ్చిందన్నారు. కావునా మృతుల కుంటుంబాలను అన్ని విధాలుగా ఆదుకోవాలన్నారు. ఫిప్ యార్డు సంస్థ బాధిత కుటుంబంలో ఒకరికి పర్మినెంట్ ఉద్యోగం ఇవ్వాలని పవన్ డిమాండ్ చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వానికి సూచించారు. విశాఖలో వరుస ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.



Next Story

Most Viewed