మహత్తర కార్యక్రమానికి శ్రీకారం: పవన్

by  |
మహత్తర కార్యక్రమానికి  శ్రీకారం: పవన్
X

దిశ, వెబ్‌డెస్క్: నదులను, భాషను కాపాడుకోవడానికి ‘మన నది – మన నుడి’ వంటి మహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఇందులో భాగంగా ఈ నెల 27 నుంచి ఐదు రోజుల పాటు వివిధ అంశాల పై ప్రజలను చైతన్యవంతం చేసేందుకు ఆన్‌లైన్ ఆధారిత కార్యక్రమాలు చేపట్టినట్టు శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఉదయం 11 గంటల నుంచి ఒంటిగంట వరకు కార్యక్రమం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే రేపు ప్రారంభ కార్యక్రమంలో ‘నుడి-నది ఇప్పుడెందుకు’ అనే అంశం పై ప్రముఖ పాత్రికేయులు ఎం.వి.ఆర్. శాస్త్రి ప్రసంగిస్తారని తెలుపుతూనే.. మిగతా కార్యక్రమాల వివరాలను జనసేనాని ప్రకటనలో వెల్లడించారు.


Next Story

Most Viewed