ఉద్యోగుల పరీక్షల్లో పాతవిధానమే..!

by  |
ఉద్యోగుల పరీక్షల్లో పాతవిధానమే..!
X

దిశ, ఏపీ బ్యూరో: వివిధ ప్రభుత్వ శాఖల్లో పదోన్నతుల కోసం పరీక్షలు రాసే ఉద్యోగులకు 40 శాతం మార్కులు వస్తే పాసయినట్లే. నెగిటివ్‌ మార్కులు ఉండబోవని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఉత్తీర్ణత మార్కులను 35 శాతం నుంచి 40శాతానికి పెంచుతున్నట్టు తెలిపింది. నెగటివ్ మార్కులుండవని ఈ మేరకు ప్రభుత్వ సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు ఇచ్చింది.

ఈ నిబంధన 1965 నుంచి 2016 వరకు అమల్లో ఉంది. 2017లో నెగిటివ్‌ మార్కుల విధానం ప్రవేశపెట్టారు. ఈ క్రమంలో 35% మార్కులకు తగ్గించారు. ఇటీవల కాలంలో ఉపాధ్యాయులు, ఉద్యోగ సంఘాల నుంచి వచ్చిన విజ్ఞప్తులు, ఏపీపీఎస్సీ కార్యదర్శి దీనిపై రాసిన లేఖను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం పాత విధానాన్ని తిరిగి అమల్లోకి తెచ్చింది.



Next Story