- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ ప్రతినిధి, ఖమ్మం: టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ జన్మదినోత్సవం సందర్భంగా ఖమ్మం జిల్లా టీఆర్ఎస్ కార్యాలయంలో నాయకులు కేక్ కట్ చేశారు. ఈ వేడుకల్లో సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, మేయర్ పాపాలాల్, పార్టీ కార్యాలయ ఇంచార్జీ ఆర్జేసీ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. అనంతరం జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో మెటర్నిటీ వార్డులో గర్భిణులకు పండ్లు, బ్రెడ్ ప్యాకెట్లను పంపిణీ చేశారు. అనంతరం మమత ఆసుపత్రిలో పార్టీ శ్రేణులు రక్తదానం నిర్వహించారు. ఈ సందర్భంగా సుడా చైర్మన్ బచ్చు విజయ్కుమార్ మాట్లాడుతూ.. తెలంగాణలో ఉద్యమం కేటీఆర్ కీలక పాత్ర పోషించారన్నారు. నాటి నుంచి నేటి వరకూ క్రియాశీల రాజకీయాల్లో ఉంటూ పార్టీలో సామాన్య కార్యకర్త స్థాయి నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్ దాకా కేటీఆర్ ఎదిగారని తెలిపారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా, మంత్రిగా పురపాలక శాఖ, ఐటీపై తనదైన ముద్రవేశారన్నారు.