అమెరికా కంపెనీతో కలిసి పనాసియా కొవిడ్-19 వ్యాక్సిన్ తయారీ!

by  |
అమెరికా కంపెనీతో కలిసి పనాసియా కొవిడ్-19 వ్యాక్సిన్ తయారీ!
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా వైరస్‌కు విరుగుడు కనుగొనేందుకు అనేక కంపెనీలు ప్రయత్నిస్తున్న వేళ, ఇండియాకు చెందిన కంపెనీలు మిగిలిన దేశాల కంటే ముందున్నాయి. ఈ క్రమంలోనే ఇండియాకు చెందిన పనాసియా బయోటెక్ కీలక నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. కరోనా వైరస్‌కు వ్యాక్సిన్ తయారు చేసేందుకు అమెరికాకు చెందిన రెఫానా కంపెనీతో కలిసి పని చేయనున్నట్టు ప్రకటించింది. ఏడాదిలో సుమారు 50 కోట్ల కొవిడ్-19 వ్యాక్సిన్ డోసులు తయారు చేసే లక్ష్యంతో రెండు కంపెనీలు పని చేయనున్నాయి. 2021 తొలి నాళ్లలో సుమారు 4 కోట్ల వ్యాక్సిన్ డోసులను అందుబాటులోకి తీసుకురానున్నట్టు స్టాక్ ఎక్స్ఛేంజీలకు ఇచ్చిన ఫైలింగ్‌లో పనాసియా బయోటెక్ పేర్కొంది. ఈ ప్రకటన అనంతరం స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో పనాసియా బయోటెక్ కంపెనీ షేర్లు 20 శాతం పెరిగాయి. భారతీయ వ్యాక్సిన్ తయారీదారులలో పనాసియా ఒకటి. సంస్థ డబ్ల్యూహెచ్‌వో అర్హత కలిగిన టీకాలను ఈ కంపెనీ విక్రయిస్తుంది. పనాసియాతో పాటు దేశీయ ప్రముఖ వ్యాక్సిన్ తయరీ కంపెనీ సీరం సైతం కొవిడ్-19 వ్యాక్సిన్ అభివృద్ధికి కృషి చేస్తోంది. ఇప్పటికే క్లినికల్ ట్రయల్స్ ప్రారంభమైనట్టు సీరం సీఈవో అడార్ పూనావాలా వెల్లడించారు. వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తున్న పలు దేశాల బయోటెక్‌లు, పరిశోధనా సంస్థలు అత్యధిక వ్యాక్సిన్ తయారీ సామర్థ్యం కలిగిన భారతీయ కంపెనీలను ఆశ్రయిస్తుండటం గమనార్హం.



Next Story

Most Viewed