పూంచ్ సెక్టార్‌పై పాక్ కాల్పులు

by  |
పూంచ్ సెక్టార్‌పై పాక్ కాల్పులు
X

దిశ, వెబ్ డెస్క్ :ఇండియా చేతిలో ఎన్నిమార్లు దెబ్బతిన్న పాక్ తన వక్రబుద్ధిని మాత్రం మార్చుకోవడం లేదు. టెర్రరిస్టుల భారత్ లోకి పంపంచి ఇక్కడ విధ్వంసానికి పాల్పడటం దానికి కొత్తేమీ కాదు. తాజాగా నియంత్రణ రేఖ (line of control) వెంబడి దాయాది పాక్ మరోసారి రెచ్చిపోయింది. కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ జమ్మూకశ్మీర్‌లోని పూంచ్ జిల్లా షాపూర్, కిర్ని, కృష్ణ ఘటి సెక్టార్లలో కాల్పులకు తెగబడింది. తేలికపాటి ఆయుధాలు, మోర్టార్లతో దాడులు చేసింది. ఆదివారం సాయంత్రం కాల్పులకు తెగబడ్డట్టు ఆర్మీ అధికారులు వెల్లడించారు.

వెంటనే అప్రమత్తమైన భారత సరిహద్దు బలగాలు పాక్ కాల్పులను సమర్ధవంతంగా తిప్పికొట్టాయి. ఉదయం కూడా LAC వెంబడి మాన్‌కోతే సెక్టార్‌పై మోర్టార్ షెల్స్‌, తేలికపాటి ఆయుధాలతో పాక్ బలగాలు కాల్పులు జరపగా, భారత్ జవాన్లు ఎదురుదాడికి దిగి వాటిని తిప్పికొట్టాయి.


Next Story

Most Viewed