ఎల్‌వోసీలో పాక్ కాల్పులు.. మహిళ మృతి

by  |
ఎల్‌వోసీలో పాక్ కాల్పులు.. మహిళ మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: పాకిస్తాన్ మరోసారి రెచ్చిపోయింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ.. జమ్ముకశ్మీర్ ఫూంచ్ జిల్లాలో ఎల్‌వోసీ వద్ద దాడి చేసింది. ఇండియన్ పోస్టులతో పాటు సరిహద్దు గ్రామాలపై పాక్ మోర్టార్లతో దాడికి దిగింది. ఈ దాడిలో 60 ఏళ్ల వృద్ధురాలు మృతి చెందారు. మరోకరికి తీవ్రంగా గాయాలు అయ్యాయి. కాగా, ఈ ఘటనలో భారత జవానులకు ఏ విధమైన గాయాలు కాలేదని పూంచ్ పోలీస్ చీఫ్ ఎఎస్పీ రమేశ్ అగర్వాల్ తెలిపారు.



Next Story