నాకు అయోధ్యకు రావాలని ఉంది: కనేరియా

by  |
నాకు అయోధ్యకు రావాలని ఉంది: కనేరియా
X

దిశ, వెబ్ డెస్క్: పాక్ మాజీ లెగ్ స్పిన్నర్ డానిష్ కనేరియా అయోధ్య రామమందిర భూమి పూజపై స్పందించారు. ఆగస్టు 5‌తేదీ హిందువులకు ఎంతో చరిత్రాత్మకమైన దినమని అన్నారు. తనకు అయోధ్యకు రావాలని ఉందని కనేరియా ట్వీట్ చేశారు. ” తాను హిందువునని.. అయోధ్య ఎంతో పవిత్ర ప్రదేశమని.. రాముడు చూపిన మార్గాన్ని ఎల్లప్పుడు పాటిస్తాను.’’ అని కనేరియా అన్నాడు. రాముడి సంకల్పం ఉంటే భవిష్యత్తులో అయోధ్యకు వచ్చి రామ్ లాలాను చూస్తానని అన్నారు. డానిష్ ట్వీట్‌పై నెటిజన్లు ఫిదా అయ్యారు. తీర్థయాత్ర కోసం కాకుండా శాశ్వతంగా భారత్‌లో ఉండాలని కోరారు. ఇలా బహిరంగంగా ట్వీట్ చేస్తే.. ప్రాణాలకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని కనేరియాకు మరికొందరు సలహా ఇచ్చారు.


Next Story

Most Viewed