ఉస్మానియా ఆస్పత్రి సూపరింటెండెంట్‌‌కు కరోనా

by  |
ఉస్మానియా ఆస్పత్రి సూపరింటెండెంట్‌‌కు కరోనా
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా వైరస్ మహమ్మారి రోజు రోజుకు విజృంభిస్తోంది. రాష్ట్రంలో ఇప్పటికే 25వేల మందికి పైగా వ్యాపించిన వైరస్… 300 మంది ప్రాణాలను బలితీసుకుంది. దాదాపు 10వేల మందికి పైగా పాజిటివ్ బాధితులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలోనే ఉస్మానియా ఆస్పత్రి సూపరింటెండెంట్‌ కూడా కరోనా పాజిటివ్ బారిన పడ్డారు. కరోనా లక్షణాల అనుమానంతో పరీక్షలు చేయించుకున్న ఆయనకు పాజిటివ్‌గా తేలింది. ఇప్పటికే పదుల సంఖ్యలో వైద్య సిబ్బందికి కరోనా సోకగా.. మూడు ఆస్పత్రుల సూపరింటెండెంట్‌లకు పాజిటివ్ వచ్చింది.



Next Story