40లక్షలు దాటిన కేసులు

by  |
40లక్షలు దాటిన కేసులు
X

దిశవెబ్ డెస్క్:
భారత్ లో కరోనా కేసుల సంఖ్య 40లక్షలు దాటింది. తాజాగా మరో 86,694 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 40,23,180కి చేరింది. కాగా గడిచిన 24 గంటల్లో 1089 మంది కరోనాతో మరణించారు. ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 69,561గా ఉంది. కాగా ఇప్పటి వరకు 8,46,395 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అందులో 31,07,223 మంది డిశ్చార్జ్ అయ్యారు. అయితే రికవరీ రేటు అధికంగా ఉండటం, మరణాల రేటు తక్కువగా ఉండటం ఉపశమనాన్ని కలిగిస్తోంది. దేశంలో రికవరీ రేటు 77.23శాతం ఉండగా..మరణాల రేటు 1.73కి తగ్గింది.


Next Story

Most Viewed