ఆహాలో ‘ఒరేయ్ బుజ్జిగా’..

by  |
ఆహాలో ‘ఒరేయ్ బుజ్జిగా’..
X

దిశ, వెబ్‌డెస్క్: కొంచెం కామెడీ.. కొంచెం డ్రామా.. ఫుల్ ఆఫ్ ఎంటర్‌టైన్మెంట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది ‘ఒరేయ్ బుజ్జిగా’. ఆహాలో ఆహా అనిపించే ఎంటర్‌టైన్మెంట్ అందించేందుకు అక్టోబర్ 2న ప్రసారం కాబోతుంది. రాజ్ తరుణ్, మాళవిక నాయర్, హెబ్బా పటేల్ హీరో హీరోయిన్లుగా డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన మూవీ ‘ఒరేయ్ బుజ్జిగా’. విజయ్‌కుమార్ కొండ డైరెక్షన్‌లో వస్తున్న సినిమాను కే.కే.రాధా‌మోహన్ నిర్మించారు.

ఇప్పటికే విడుదలైన ట్రైలర్, సాంగ్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చినా కరోనా మహమ్మారి కారణంగా థియేటర్‌లో విడుదల చేసే పరిస్థితి లేదు. దీంతో డిజిటల్ ప్లాట్ ఫామ్ ‘ఆహా’ను ఎంచుకున్నట్లు తెలిపింది మూవీ యూనిట్. అక్టోబర్ 2..గాంధీ జయంతి కానుకగా విడుదల కాబోతున్న సినిమాను ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి ఎంజాయ్ చేయాలని మూవీ యూనిట్ సభ్యులు కోరారు. నరేష్, వాణీ విశ్వనాథ్, పోసాని కృష్ణమురళి, అన్నపూర్ణమ్మ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం సమకూర్చారు.


Next Story