గాలిస్తుండగా కాల్పులకు తెగబడ్డారు..

by  |
గాలిస్తుండగా కాల్పులకు తెగబడ్డారు..
X

దిశ, వెబ్ డెస్క్: జమ్మూకాశ్మీర్ లో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. వివరాల్లోకి వెళితే.. షోపియాన్ జిల్లా పింజోరా ప్రాంతంలో ఉగ్రవాదులున్నారన్న సమాచారం అందడంతో భద్రతా దళాలు గాలింపు చేపట్టాయి. ఈ సందర్భంలో భద్రతాదళాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు మృతిచెందారు. ముగ్గురు జవాన్లు గాయపడ్డారు.


Next Story

Most Viewed