అడవి శేషు 'ఎవరు'కు ఏడాది..

by  |
అడవి శేషు ఎవరుకు ఏడాది..
X

చిన్న సినిమాగా వచ్చి బిగ్ హిట్ అందుకున్న చిత్రం ‘ఎవరు’. అడవి శేషు, రెజీనా కసాండ్రా ప్రధాన పాత్రల్లో వచ్చిన సస్పెన్స్ థ్రిల్లర్ విమర్శకుల ప్రశంసలు అందుకుని బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. కాగా ఈ సినిమా రిలీజై ఏడాదవుతున్న సందర్భంగా మూవీ యూనిట్‌కు థాంక్స్ చెప్తూ స్పెషల్ పోస్ట్ పెట్టారు హీరో అడవి శేషు.

తన కెరియర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ అందించిన డైరెక్టర్ వెంకట్ రాంజీ.. పీవీపీ సినిమాస్‌కు థాంక్స్ చెప్పడంతో పాటు బ్రిలియంట్ డైలాగ్స్ అందించిన అబ్బూరి రవికి ధన్యవాదాలు తెలిపారు. టీం మొత్తం ప్రాణం పెట్టి పనిచేస్తే ఆడియన్స్ ప్రేమ చూపించారని తెలిపారు శేషు.

https://twitter.com/AdiviSesh/status/1294489280824279041?s=09

మూవీ యూనిట్ సినిమాను క్యారీ చేసిన విధానం.. సొంత చిత్రంగా అడాప్ట్ చేసుకున్న పద్ధతికి గర్వపడుతున్నానని తెలిపాడు. మెమొరబుల్ జర్నీ అందించిన ‘ఎవరు’ కో స్టార్స్, డైరెక్షన్ డిపార్ట్‌మెంట్, డీఓపీ, మ్యూజిక్, ఎడిటర్, ఆర్ట్ డైరెక్టర్, పీఆర్ఓ ఇలా ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపిన అడవి శేషు.. కరోనా పరిస్థితులు నార్మల్ కాగానే మేజర్ సినిమా గురించి అప్‌డేట్స్ అందించనున్నట్లు చెప్పాడు.


Next Story