లారీ ఢీ కొని ఒకరి మృతి

by  |
లారీ ఢీ కొని ఒకరి మృతి
X

దిశ, వర్ధన్నపేట: వరంగల్ అర్బన్ ఐనవోలు మండలం పంథిని గ్రామ శివారులో ఖమ్మం వైపు వెళ్తున్న లారీ ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ఘటనలో బైక్ పై వెళ్తున్న వర్ధన్నపేట మండలం ఉప్పరపల్లి గ్రామనికి చెందిన కందకట్ల రాజు(40) అక్కడికక్కడే మృతిచెందాడు. గమనిచిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పర్వతగిరి సీఐ కిషన్, ఐనవోలు ఎస్ఐ నరసింహరావు మృతదేహాన్ని ఎంజీఎం మార్చురీకి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.


Next Story