త్రిబుల్ రైడింగ్ చేస్తూ వెళ్లారు.. అంతలోనే?

by  |
త్రిబుల్ రైడింగ్ చేస్తూ వెళ్లారు.. అంతలోనే?
X

దిశ, మెదక్: సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం శివంపేట ప్రధాన రహదారిపై ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. త్రిబుల్ రైడింగ్ చేస్తూ వెళ్తున్న క్రమంలో అదుపుతప్పిన బైక్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు 108 సమాచారం అందించి.. చికిత్స నిమిత్తం సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడు మెదక్ జిల్లా కొల్చారం మండలం రంగంపేట మందాపూర్‌కు చెందిన రమేశ్‌గా (31) గుర్తించారు. ఇతడు సంగారెడ్డిలో ఓ ప్రైవేట్ సంస్థలో సెక్యూరిటీగా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలోనే విధులను హాజరయ్యేందుకు మరో ఇద్దరితో కలిసి ఒకై బైక్‌పై బయల్దేరాడు. ఇంతలోనే మార్గమధ్యలో మృత్యువు కబలించింది.


Download Dishadaily Android APP

Download Dishadaily IOS APP



Next Story

Most Viewed