ఘాట్ రోడ్డులో ప్రమాదం… ఒకరు మృతి

by  |
ఘాట్ రోడ్డులో ప్రమాదం… ఒకరు మృతి
X

దిశ ప్రతినిధి, మహబూబ్‌నగర్: శ్రీశైలం ఘాట్ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గుర్తు తెలియని వాహనం బైక్‌పై వెళుతున్న ఇద్దరిని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందగా, మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ప్రమాద స్థలానికి చేరుకుని, గాయపడ్డ వ్యక్తిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన నాగర్ కర్నూల్ జిల్లా ఆమ్రాబాద్ మండలం శ్రీశైలం-హైదరాబాద్ ప్రధాన రహదారిలో దోమలపెంట వటవర్ల‌పల్లి మార్గంమధ్యలో ఆదివారం చోటుచేసుకుంది.


Next Story