బ్రిడ్జిని ఢీకొట్టిన లారీ: ఒకరు మృతి

by  |
బ్రిడ్జిని ఢీకొట్టిన లారీ: ఒకరు మృతి
X

దిశ, రాజేంద్రనగర్: రంగారెడ్డి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. మహేశ్వరం మండలం నాగారం నుంచి ఇటుకలతో శివరాంపల్లి వెళ్తున్న లారీ అరాంఘర్ వద్దకు రాగానే అదుపుతప్పి నిర్మాణంలో ఉన్న బ్రిడ్జిని ఢీకొట్టింది. దీంతో లారీ బోల్తా పడటంతో క్యాబిన్‌లో ఉన్న కేతావత్ శంకర్ (35) అక్కడికక్కడే మృతి చెందాడు. లారీ డ్రైవర్ రమేష్ (25), మరో వ్యక్తి శ్రీనివాస్ (26) కు తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను చికిత్స కోసం ఆసుత్రికి తరించారు.


Next Story

Most Viewed