దుప్పట్లో వృద్ధురాలి మృతదేహం..

by  |
దుప్పట్లో వృద్ధురాలి మృతదేహం..
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌ ఏరియాలో ఆదివారం దారుణం వెలుగుచూసింది. లుంబినీ మాల్ ఎదురుగా దుప్పట్లో ఓ వృద్దురాలు(72) మృతదేహం లభ్యమైంది. వృద్దురాలు ఒంటి మీద ఎలాంటి గాయాలు లేవు. దీంతో కరోనాతో చనిపోయిన వృద్దురాలు మృతదేహాన్ని ఇక్కడకు తీసుకొచ్చి పడేసి ఉంటాని పలువురు అనుమానిస్తున్నారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. ఐపీసీ సెక్షన్ 174కింద అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. సీసీ కెమెరాల ఆధారంగా విచారణ జరుపుతున్నట్లు బంజారాహిల్స్ సీఐ కళింగ రావు తెలిపారు.


Next Story