సెక్రెటేరియట్ ఖాళీ..కూల్చివేతకు రంగం సిద్ధం

by  |
సెక్రెటేరియట్ ఖాళీ..కూల్చివేతకు రంగం సిద్ధం
X

దిశ, వెబ్‌డెస్క్: ఉమ్మడి ఏపీలో పరిపాలన సాగించినా..రాష్ట్ర అవతరణ అనంతరం కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ద్వారా పాలనకు నోచుకోని పాత సచివాలయ భవనం శరవేగంగా ఖాళీ అవుతున్నది. ఇప్పటికే అందులోని సగానికి పైగా విభాగాలను బీఆర్‌కే భవన్‌కు తరలించి అక్కడి నుంచే పాలన సాగిస్తున్నారు. ప్రస్తుతం సెక్రెటేరియట్ వద్దనున్న వాహనాలను కూడా తరలిస్తున్నారు. సచివాలయం కూల్చివేతకు సంబంధించి రాష్ట్ర హైకోర్టు ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో.. ప్రభుత్వం దానిని కూల్చివేసేందుకు ఏర్పాట్లు చేసింది.ఈ నేపథ్యంలోనే అక్కడ మిగిలిపోయిన వస్తుసామాగ్రి, పాత వాహనాలను బుధవారం తరలించారు. ఇదిలాఉండగా ఒకటి, రెండ్రోజుల్లో సచివాలయాన్ని ప్రభుత్వం కూల్చివేసి..అక్కడ కొత్త సచివాలయ భవనాల నిర్మాణం చేయనున్నది.


Next Story

Most Viewed