వృద్ధాశ్రమంలో వృద్ధుడు ఆత్మహత్య

by  |
వృద్ధాశ్రమంలో వృద్ధుడు ఆత్మహత్య
X

దిశ, హుజురాబాద్: వృద్ధాశ్రమంలో ఒకరు ఆత్మహత్య చేసుకున్న ఘటన కరీంనగర్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కరీంనగర్ జిల్లా ఇల్లందకుంటలోని రామసాయి చారిటబుల్ ట్రస్ట్ వృద్ధాశ్రమంలో పోరెడ్డి అంకిరెడ్డి అనే వృద్ధుడు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

ఆశ్రమంలో కరోనా పాజిటివ్ కేసు నమోదు కావడంతో మిగతా వారిని వారివారి కుటుంబ సభ్యులు ఆ వృద్ధులను తీసుకెళ్లారు. అయితే, తనకోసం ఎవరు రాకపోవడంతో మనస్తాపంతో అంకిరెడ్డి ఆత్మహత్య చేసుకున్నారు. మృతుడికి వివాహం అయిన కొంతకాలానికే భార్యను విడిచిపెట్టినట్టు స్థానికులు చెబుతున్నారు.


Next Story

Most Viewed