‘తెలంగాణ సుభిక్షంగా ఉండాలి’

by  |
‘తెలంగాణ సుభిక్షంగా ఉండాలి’
X

దిశ, నల్గొండ: పరమశివుని ఆశిస్సులతో తెలంగాణ ఎల్లప్పుడూ సుభిక్షంగా ఉండాలని రాష్ట్ర విద్యుత్ శాఖమంత్రి జగదీశ్ రెడ్డి కోరుకున్నారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా నల్గొండ జిల్లాలో కృష్ణా, మూసి నదీ సంగమం వద్ద వెలసిన వాడపల్లి మీనాక్షి సమేత అగస్తేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎంపీ లింగయ్య యాదవ్, ఎమ్మెల్యే భాస్కర్ రావులు పాల్గొన్నారు. పూజల అనంతరం తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్మించిన కల్యాణ మండపాన్ని ప్రారంభించి, అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.


Next Story

Most Viewed