- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు

దిశ, వెబ్డెస్క్: ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు భారీగా తగ్గాయి. గడిచిన 24గంటల్లో 25,445మందికి పరీక్షలు నిర్వహించగా 95మందికి పాజిటివ్గా తేలింది. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 8,88,809కి చేరింది. ఒకరు చనిపోవడంతో మొత్తం మృతుల సంఖ్య 7,157గా ఉంది. ప్రస్తుతం 1,162 యాక్టివ్ కేసులు ఉండగా ఇప్పటివరకు చికిత్స తీసుకొని 8,79,780 మంది బాధితులు డిశ్చార్జ్ అయ్యారు. ఒక్కరోజులో 129మంది కోలుకున్నారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 1,32,14,548 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు ప్రభుత్వం తెలిపింది.
అనంతపురం జిల్లాలో 5కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా చిత్తూరులో 9, తూర్పుగోదావరిలో 7, గుంటూరులో 16, కడపలో 1, కృష్ణా జిల్లాలో 17, కర్నూలులో 4, నెల్లూరులో 7, శ్రీకాకుళంలో 6, విశాఖపట్నంలో 3, పశ్చిమగోదావరిలో 4 కేసులు వచ్చాయి. ప్రకాశం జిల్లాలో ఒక్క కరోనా కేసూ నమోదు కాలేదు. కరోనా మహమ్మారి బారిన పడి విశాఖపట్నంలో ఒకరు చనిపోయినట్లు హెల్త్ బులెటిన్ వెల్లడించింది.