- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఏపీలో కొత్తగా 479 కరోనా కేసులు

దిశ, వెబ్డెస్క్: ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24గంటల్లో 62,215మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 479మందికి పాజిటివ్గా తేలింది. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,75,285కు చేరింది. 4 మరణాలు సంభవించడంతో మృతుల సంఖ్య 7,074గా ఉంది. ప్రస్తుతం 4,355 యాక్టివ్ కేసులు ఉండగా ఇప్పటివరకు చికిత్స తీసుకొని 8,66,856 మంది బాధితులు డిశ్చార్జ్ అయ్యారు. ఒక్కరోజులో 497మంది కోలుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 1,11,96,574మందికి కరోనా శాంపిల్స్ పరీక్షించినట్లు ప్రభుత్వం తెలిపింది.
అనంతపురం జిల్లాలో 13 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా చిత్తూరులో 87, తూర్పుగోదావరిలో 47, గుంటూరులో 62, కడపలో 23, కృష్ణాలో 92, కర్నూలులో 26, నెల్లూరులో 16, ప్రకాశంలో 21, శ్రీకాకుళంలో 10, విశాఖపట్నంలో 47, పశ్చిమగోదావరిలో 22 కేసులు వచ్చాయి. కరోనా మహమ్మారి బారిన పడి చిత్తూరు, గుంటూరు, కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున చనిపోయినట్లు హెల్త్ బులెటిన్ వెల్లడించింది.