ఏపీలో కరోనా విజృంభణ

by  |
ఏపీలో కరోనా విజృంభణ
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధప్రదేశ్‌లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24గంటల్లో 62, 123మందికి పరీక్షలు చేయగా 10,080మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో కరోనా కేసుల సంఖ్య 2లక్షల 14వేల 145కు చేరింది. ఇవాళ 97మంది చనిపోగా మొత్తం మృతుల సంఖ్య 1,939కి చేరింది. గడిచిన 24గంటల్లో 9,151మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. నేటివరకు రాష్ట్రంలో 24లక్షల 24వేల 393మందికి శాంపిల్స్‌ను పరీక్షించారు.

ఇవాళ కరోనా వైరస్ బారిన పడి గుంటూరు జిల్లాలో 14మంది చనిపోగా, అనంతపురంలో పదకొండు మంది, కర్నూలు 10, పశ్చిమగోదావరి 10, చిత్తూరు 8, నెల్లూరు 8, ప్రకాశం 7, శ్రీకాకుళం 7, తూర్పుగోదావరి 6, విశాఖపట్నం 5, విజయనగరం 5, కృష్ణా 4, కడప జిల్లాలో ఇద్దరు మరణించినట్లు ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్యశాఖ బులెటిన్ వెల్లడించింది. ప్రస్తుతం 85వేల 486 యాక్టివ్ కేసులు ఉండగా.. ఇప్పటివరకు చికిత్స తీసుకొని లక్షా 26వేల 720మంది డిశ్చార్జ్ అయ్యారు.


Next Story

Most Viewed