తెలంగాణలో కరోనా విలయతాండవం

by  |
తెలంగాణలో కరోనా విలయతాండవం
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. రోజురోజుకు కేసులు విపరీతంగా వస్తున్నాయి. గడిచిన 24గంటల్లో 1,879 కేసులు నమోదు అయ్యాయి. హైదరాబాద్ పరిధిలోనే 1,422 కేసులు రాగా, రంగారెడ్డి జిల్లాలో 176, మేడ్చల్ జిల్లాలో 94 కొత్త పాజిటివ్ కేసులు వచ్చాయి. కరోనాతో ఇవాళ ఏడుగురు చనిపోగా మొత్తం మృతుల సంఖ్య 313కు చేరింది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 27,612 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. యాక్టివ్ కేసులు 11, 012 ఉండగా, ఇప్పటివరకు కరోనాకు చికిత్స తీసుకొని 16,287మంది డిశ్చార్జ్ అయ్యారు.


Next Story

Most Viewed