ఎన్ని అరెస్టులు చేసినా… మా పంతం మారదు

by  |
ఎన్ని అరెస్టులు చేసినా… మా పంతం మారదు
X

దిశ, భువనగిరి: నూతన విద్యా విధానాన్ని వ్యతిరేకిస్తున్న ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షులు వెంకట్ బల్మూర్ అరెస్టును నిర‌సిస్తూ గురువారం యాదాద్రి-భువనగిరి జిల్లా కేంద్రంలో సీఎం కేసీఆర్ దిష్టి బొమ్మను దహనం చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఆందోళన కారులను అరెస్ట్ చేశారు.

ఈ సందర్భంగా ఎన్ఎస్‌యూఐ జిల్లా అధ్యక్షులు మంగ ప్రవీణ్ మాట్లాడుతూ… ఎన్ని అరెస్టులు చేసినా నూతన విద్యా విధానంపై మా పంతం మారదని, విద్యార్థులకు అండగా ఎన్ఎస్‌యూ‌ఐ నిలుస్తుందన్నారు. అరెస్ట్ చేసిన ఎన్ఎస్‌యూఐ నాయకులను తక్షణమే ఎలాంటి కేసులు లేకుండా విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చ రించారు.


Next Story

Most Viewed