పీపీఈ కిట్లతో NSUI కార్యకర్తలు ప్రత్యక్షం

by  |
పీపీఈ కిట్లతో NSUI కార్యకర్తలు ప్రత్యక్షం
X

దిశ, వెబ్ డెస్క్: నగరంలోని ప్రగతిభవన్ ముందు NSUI కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం వారిని రిమాండ్ కు పంపించారు. ఈ విషయమై వివరణ అడుగగా కొవిడ్ నిబంధనలను ఉల్లంఘించినందునే వారిని అరెస్ట్ చేశామని పోలీసులు చెబుతున్నారు.

కరోనా విషయంలో ప్రభుత్వం విఫలమైందంటూ ఎన్ఎస్ యూఐ కార్యకర్తలు బుధవారం ప్రగతి భవన్ ముట్టడికి ప్రయత్నించారు. పీపీఈ కిట్ల ధరించి వారు ప్రగతి భవన్ ముందు ప్రత్యక్షమయ్యారు. అనంతరం ప్రగతి భవన్ లోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. అక్కడే ఉన్న పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. అనంతరం రిమాండ్ కు తరలించారు.


Next Story

Most Viewed