భారత్, నేపాల్‌లను ఏ శక్తీ విడదీయలేదు: రాజ్‌నాథ్ సింగ్

by  |
భారత్, నేపాల్‌లను ఏ శక్తీ విడదీయలేదు: రాజ్‌నాథ్ సింగ్
X

న్యూఢిల్లీ: భారత భూభాగాన్ని కలుపుకున్న నేపాల్ కొత్త మ్యాప్‌కు ఆ దేశ పార్లమెంటు ఆమోదం తెలిపిన నేపథ్యంలో కేంద్ర రక్షణ మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్, నేపాల్‌లది ‘రోటీ బేటీ’ బంధమని, ప్రపంచంలోని ఏ శక్తి వీటిని విడదీయలేదని అన్నారు.

నేపాల్‌ చర్యల వెనుక వేరొకరి హస్తమున్నదని ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవాణె వ్యాఖ్యలు చేసిన సందర్భంలో కేంద్ర మంత్రి ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. నేపాల్‌తో ఏర్పడ్డ అభిప్రాయభేదాలు చర్చల ద్వారా పరిష్కృతమవుతాయని తెలిపారు.

ఉత్తరాఖండ్ ర్యాలీ కోసం ఆన్‌లైన్‌లో మాట్లాడుతూ సరిహద్దు సమీపంలో భారత్ కట్టిన రోడ్ ద్వారా నేపాల్‌లో భిన్నాభిప్రాయాలు ఏర్పడితే వాటిని చర్చించి పరిష్కరిచుకుంటామని చెప్పారు.


Next Story

Most Viewed