అక్టోబర్‌ 9న నిజామాబాద్ స్థానిక సంస్థల ఉపఎన్నిక

by  |
అక్టోబర్‌ 9న నిజామాబాద్ స్థానిక సంస్థల ఉపఎన్నిక
X

దిశ, వెబ్‌డెస్క్: అక్టోబర్ 9న నిజామాబాద్ స్థానిక సంస్థల ఉప ఎన్నిక జరగనుంది. ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు పోలింగ్ నిర్వహించి అక్టోబర్ 12న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. దీనికి సంబంధించిన షెడ్యూల్ శుక్రవారం విడుదల అయ్యింది. అయితే ఏప్రిల్‌ 7వ తేదీనే పోలింగ్ జరగాల్సి ఉండగా కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్‌తో వాయిదా పడింది. నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎన్నికైన భూపతిరెడ్డి పార్టీ ఫిరాయింపునకు పాల్పడ్డారనే ఆరోపణలతో అనర్హుడిగా ప్రకటించగా ఖాళీ ఏర్పడింది. టీఆర్ఎస్ నుంచి కల్వకుంట్ల కవిత.. కాంగ్రెస్ నుంచి సుభాష్ రెడ్డి, బీజేపీ నుంచి లక్ష్మీనారాయణ నామినేషన్ వేశారు.


Next Story