దేశంలో కరోనా విలయతాండవం

by  |
దేశంలో కరోనా విలయతాండవం
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతూ విలయతాండవం చేస్తోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 86,052 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. మహమ్మారి బారిన పడి నిన్న ఒక్కరోజే 1,141 మంది మృత్యువాత పడ్డారు. దీంతో దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 58,18,571కు చేరాయి. మరణాల సంఖ్య 92,290కి చేరాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా యాక్టివ్ కేసులు సంఖ్య 9,70,116గా ఉన్నాయి. వైరస్ బారిన పడి సంపూర్ణ ఆరోగ్యంగా ఆస్పత్రుల నుంచి 47,56,164 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు.


Next Story

Most Viewed