ఏపీలో తగ్గిన కరోనా… కొత్తగా ఎన్నంటే?

by  |
ఏపీలో తగ్గిన కరోనా… కొత్తగా ఎన్నంటే?
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో కరోనా మహమ్మారి విస్తృతంగా వ్యాప్తిచెందుతోంది. ఎంత కట్టడిచేసినా తగ్గకుండా విలయతాండవం చేస్తోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 6,235 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 6,31,749కు చేరింది. తాజాగా 51 మంది మరణించగా.. మృతుల సంఖ్య 45,10కు చేరింది. కొత్తగా 10,502 మంది కరోనాను జయించగా.. కోలుకున్న వారి సంఖ్య 5,48,926 కు చేరింది.

ఎక్కువగా నమోదైన జిల్లాల్లో తూర్పు గోదావరిలో 1262, పశ్చిమ గోదావరిలో 962, ప్రకాశంలో 841, అనంతపురంలో 505, కొత్త కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా కృష్ణాజిల్లాలో 9 మంది.. చిత్తూరులో ఏడుగురు, విశాఖపట్నంలో ఆరుగురు, అనంతపురంలో ఐదుగురు మరణించారు.


Next Story