శిరోముండనం కేసులో కొత్తకోణం

by  |
శిరోముండనం కేసులో కొత్తకోణం
X

దిశ, ఏపీ బ్యూరో: నూతన్ నాయుడి ఇంట్లో దళిత యువకుడిని కొడుతూ శిరోముండనం చేయించిన ఘటనలో సోమవారం మరో కీలక విషయాన్ని పోలీసులు గుర్తించారు. నూతన్ నాయుడి ఇంటి నుంచి సేకరించిన సీసీటీవీ ఫుటేజీలో ఓ మహిళ ఎవరికో వీడియో కాల్ చేసి శిరోముండనాన్ని చూపించే ప్రయత్నం చేసింది.

దీంతో ఆమె ఎవరికి కాల్ చేసింది.. ఈ కేసులో ఇంకెవరి ప్రమేయమైనా ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. చుట్టుపక్కల వారిని కూడా విచారించారు. నూతన్ ఇంటి నుంచి అరుపులు వినిపించాయని, శ్రీకాంత్‌కు గుండుకొట్టించి బయటకు తీసుకురావడాన్ని తాము చూశామని పోలీసులకు తెలిపారు.


Next Story

Most Viewed