వెండి సింహాల మాయం కేసులో కొత్త కోణం

by  |
వెండి సింహాల మాయం కేసులో కొత్త కోణం
X

దిశ, వెబ్‌డెస్క్: విజయవాడ దుర్గగుడిలో వెండి సింహాల మాయం కేసులో కొత్త కోణం వెలుగుచూసింది. సబ్‌ కాంట్రాక్టర్ వెంకట్ పోలీసులకు ఇచ్చిన స్టేట్‌మెంట్ మరింత కీలకంగా మారింది. గత మార్చిలో ఉగాదికి రథాన్ని సిద్ధం చేయడానికి వచ్చినప్పుడు.. సింహాలు ఉన్నాయని పోలీసులకు వెంకట్ స్టేట్‌మెంట్ ఇచ్చారు. దీంతో లాక్‌డౌన్ సమయంలోనే సింహాలు చోరికి గురయ్యాయని పోలీసులు నిర్దారణకు వచ్చారు. దీంతో దొంగతనం చేసింది.. ఇంటి దొంగలా.. బయటి దొంగలా అన్న కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇదే కేసులో ఇప్పటికే సెక్యూరిటీ సిబ్బంది, స్టాఫ్‌ను విచారించినట్టు తెలుస్తోంది.


Next Story