- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వెబ్డెస్క్: భారత్కు ఇబ్బంది కలిగించేలా నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ చేస్తున్న వ్యాఖ్యలపై సొంత దేశంలోనే విమర్శలు ఎదురవుతున్నాయి. శ్రీరాముడి జన్మస్థలం అయోధ్య కాదని..రాముడు నేపాల్లో జన్మించాడని, సీతా మాతది కూడా నేపాలే అంటూ ఓలీ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో నేపాల్ రాష్ట్రీయ ప్రజాతంత్ర పార్టీ నేత కమల్ థాపా మాట్లాడుతూ, ప్రధాని స్థానంలో ఉన్న వ్యక్తి ఇలాంటి నిరాధార వ్యాఖ్యలు చేయడం తగదని అన్నారు. ఇప్పటికే ఓలీ తీరుతో ఇరు దేశాల మధ్య సంబంధాలు బలహీన పడ్డాయని ఆయన మండిపడ్డారు. ఇరు దేశాల మధ్య సంబంధాలను నాశనం చేయాలని ఓలీ చూస్తున్నారని అన్నారు.
నేపాల్ ప్రధాన వార్తాపత్రిక ఖాట్మండు పోస్ట్ ఈ అంశంపై ప్రత్యేక కథనాన్ని రాసింది. ఓలీ చేసిన వ్యాఖ్యలతో ఇరు దేశాల మధ్య, నాయకుల మధ్య, ప్రజల మధ్య సంబంధాలు తెగిపోయేలా ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నట్టు ఓ కథనంలో పేర్కొంది. చైనా ప్రోద్బలంతో ఓలీ ఇటీవల వివాదాస్పద రీతిలో వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.