నీట్, జేఈఈ పరీక్షలు వాయిదా

by  |
నీట్, జేఈఈ పరీక్షలు వాయిదా
X

దిశ, వెబ్ డెస్క్: దేశంలో కరోనా మహమ్మారి విస్తృతంగా వ్యాప్తి చెందుతుండటంతో ఇప్పటికే నిర్వహించాల్సిన పరీక్షలు అనేకం వాయిదా పడ్డాయి. తాజాగా నీట్, జేఈఈ మెయిన్స్ పరీక్షలను కూడా వాయిదా వేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా వాయిదా వేసిన పరీక్షల నిర్వాహణ షెడ్యూల్ కూడా విడుదల చేసింది. సెప్టెంబర్ 1 నుంచి 6వ తేదీ వరకూ జేఈఈ మెయిన్స్ పరీక్షలు నిర్వహించాలని, సెప్టెంబర్ 13న నీట్ పరీక్షలు నిర్వహించాలని స్పష్టం చేసింది. అదేవిధంగా సెప్టెంబర్ 17వ తేదీన జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష నిర్వహించాలని నిర్ణయించింది. కాగా విద్యాసంస్థలన్నీ క్వారంటైన్ కేంద్రాలుగా మార్చిన నేపథ్యంలో విద్యార్థులు పరీక్షలు రాసే పరిస్థితి కనిపించడం లేదని కేంద్రం స్పష్టం చేసింది.



Next Story