ఇండియాలో ఒక్కరోజే 83,341 కేసులు..

by  |
ఇండియాలో ఒక్కరోజే  83,341 కేసులు..
X

దిశ, వెబ్‌డెస్క్ :

దేశవ్యాప్తంగా కరోనా కేసులు అమాంతం పెరిగిపోతున్నాయి. వైరస్ నివారణకు కేంద్రం పకడ్భందీ చర్యలు తీసుకుంటున్నా ఫలితం మాత్రం ఆశించినంత కనిపించడం లేదు. అయితే, దేశంలో రికవరీ రేటు పెరుగుతుండటం కొద్దిగా ఊరట కలిగించే అంశం. తాజాగా కేంద్ర వైద్యారోగ్య విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌ ప్రకారం.. గడచిన 24 గంటల్లో 83,341 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 39,36,748కు చేరుకుంది. ప్రస్తుతం 8,31,124 యాక్టివ్ కేసులున్నాయి.

కరోనా నుంచి కోలుకుని దేశవాప్తంగా 30,37,152 మంది డిశ్చార్జి అయ్యారు. తాజాగా కరోనాతో 1,096 మంది మృతి చెందగా, దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 68,472 కరోనా మరణాలు సంభవించాయి.


Next Story

Most Viewed