యువకుడి పేరుతో మహిళకు మెసేజ్.. అంతలోనే శవమై..

by  |
యువకుడి పేరుతో మహిళకు మెసేజ్.. అంతలోనే శవమై..
X

దిశ, వెబ్‌డెస్క్: ఓ యువకుడి పేరుతో మహిళకు మెసేజ్ వచ్చింది. అది చూసిన భర్త నిలదీయడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగి ఆ మహిళ ప్రాణాలు కోల్పోయింది. విశాఖ జిల్లాలో జరిగిన ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. విజయనగరం జిల్లా కంటోన్మెంట్‌కు చెందిన నవీన్‌కుమార్, పద్మ 2015లో ప్రేమ వివాహం చేసుకున్నారు. అప్పటి నుంచి విశాఖ జిల్లా పద్మనాభం మండలం విలాస్‌ఖాన్ గ్రామంలో నివాసం ఉంటున్నారు. నవీన్‌కుమార్ ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో పనిచేస్తుండగా భార్య ఇంటి వద్దే ఉంటోంది.

నవీన్‌కుమార్ రోజు మాదిరిగానే ఆదివారం డ్యూటీకి వెళ్లి రాత్రి 9.30గంటల సమయంలో ఇంటికి చేరుకున్నాడు.. అదే సమయంలో భార్యకు వాట్సప్‌లో ఓ మెసేజ్ రావడంతో చూసిన భర్త.. యువకుడు ఎవరని ప్రశ్నించడంతో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో కోపానికి గురైన నవీన్ కుమార్ అర్థరాత్రి ఒంటిగంట సమయంలో భార్యను గొంతు నులిమి చంపాడు. అనంతరం కింది పోర్షన్‌లో రెంట్‌కు ఉండేవారికి తన భార్య కడుపు నొప్పి భరించలేక చనిపోయిందని తెలిపాడు. ఇంతలోనే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. తమదైన శైలిలో విచారించడంతో భార్యను హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


Next Story