- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
పహల్గామ్ లో మతం పేరుతో ఉగ్రదాడి.. ఉగ్రదాడి బాధితుడి సంచలన నిర్ణయం

దిశ, వెబ్ డెస్క్: పహల్గామ్ (Pahalgam) లో మతం పేరుతో ఉగ్రదాడి జరిగిందని చెబుతూ.. ఉగ్రదాడి బాధితుడు (Terror Attack Victim) సంచలన నిర్ణయం తీసుకున్నాడు. జమ్మూ కాశ్మీర్ (Jammu Kashmir)లోని పహల్గామ్ ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. అంతేగాక ఈ దాడిలో చాలామంది గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ దాడిలో ఉగ్రమూకలు మతం పేరు అడిగి మరీ ఓ వర్గానికి చెందిన వారినే హతమార్చారని ప్రత్యక్ష సాక్షులు (Eyewitnesses) తెలిపారు. దీంతో దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి.
అయితే మతం పేరుతో జరిగిన ఈ చర్యపై నిరసనగా ఉగ్రదాడి బాధితుడు సబీర్ హుస్సేన్ (Sabir Hussain) తన మతాన్ని విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నాడు. బైసరన్ పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిలో బదురియాకు చెందిన సబీర్ హుస్సేన్ కూడా గాయపడ్డారు. ఇస్లాం పేరు చెప్పి జరిపిన ఈ చర్య సరైనది కాదంటూ ఇస్లాంను విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నట్లు కోర్టును ఆశ్రయించాడు. దీనిపై సబీర్ హుస్సేన్ మాట్లాడుతూ.. హింసను వ్యాప్తి చేయడానికి మతాన్ని పదే పదే ఉపయోగిస్తున్నారని, ఇది సరైన పద్దతి కాదని అన్నారు. అంతేగాక తాను ఏ మతాన్ని అగౌరవపరచడం లేదని, ఇది నా వ్యక్తిగత నిర్ణయం అని చెప్పారు. హింసను వ్యాప్తి చేయడానికి మతాన్ని ఆయుధంగా ఎలా ఉపయోగిస్తారో స్పష్టంగా చూశానని, కాశ్మీర్ లో ఇది చాలా సార్లు జరిగిందని, ఇకపై తాను దీన్ని సహించనని సబీర్ అన్నారు.