Siddaramaiah : దివ్యాంగురాలి స్థలాన్ని కబ్జా చేసి సీఎం ఇల్లు కట్టుకున్నారు : కేంద్రమంత్రి

by Hajipasha |   ( Updated:2024-09-14 14:58:30.0  )
Siddaramaiah : దివ్యాంగురాలి స్థలాన్ని కబ్జా చేసి సీఎం ఇల్లు కట్టుకున్నారు : కేంద్రమంత్రి
X

దిశ, నేషనల్ బ్యూరో : కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై కేంద్ర మంత్రి, జేడీఎస్ అగ్రనేత హెచ్‌డీ కుమారస్వామి సంచలన ఆరోపణలు చేశారు. దళిత వర్గానికి చెందిన సాకమ్మ అనే దివ్యాంగురాలికి మైసూర్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ముడా) కేటాయించిన స్థలాన్ని కబ్జా చేసి సీఎం సిద్ధరామయ్య ఇంటిని నిర్మించుకున్నారని ఆయన ఆరోపించారు. శనివారం విలేకరుల సమావేశంలో ఈ వివరాలను కుమారస్వామి వెల్లడించారు. డిప్యూటీ సీఎంగా ఉన్న టైంలోనే సిద్ధరామయ్య ఈ అక్రమానికి పాల్పడ్డారని తెలిపారు. దీనికి సంబంధించిన ఆధారాలను బయటపెట్టేందుకు తాను సిద్ధమన్నారు.

‘‘రూ.24వేలు చెల్లించిన తర్వాత సాకమ్మకు ముడా స్థలాన్ని కేటాయించారు. అయితే ఆమె పేరిట తప్పుడు డాక్యుమెంట్లను తయారు చేసి 10వేల చదరపు అడుగుల స్థలంలో సీఎం సిద్ధరామయ్య ఇంటిని కట్టించారు’’ అని కుమారస్వామి వివరించారు. మైసూరు సహా రాష్ట్రంలోని 14 చోట్ల భార్యకు సీఎం సిద్ధరామయ్య అక్రమంగా స్థలాలను కట్టబెట్టారని కేంద్ర మంత్రి మండిపడ్డారు. దీనిపై సీఎంను విచారించేందుకు కర్ణాటక గవర్నర్ అనుమతులిచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. 1996 నుంచి 1999, 2004 నుంచి 2005 మధ్యకాలంలో సిద్ధరామయ్య కర్ణాటక డిప్యూటీ సీఎంగా వ్యవహరించారు.

Advertisement

Next Story

Most Viewed