- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
Nitin Gadkari: అలా చేస్తే నాన్ బెయిలబుల్ కేసు: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మాస్ వార్నింగ్

దిశ, వెబ్డెస్క్: రోడ్డు ప్రమాదాల్లో భారత్ ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉందని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ (Nitin Gadkari) అన్నారు. న్యూ ఢిల్లీ (New Delhi)లో ఇండస్ట్రీ బాడీ సీఐఐ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇక నుంచి నాసిరకం రోడ్ల నిర్మాణాలను చేపడితే ఆ విషయాన్ని తాము నేరంగా పరిగణిస్తామని అన్నారు. రోడ్డు కాంట్రాక్టర్లు, ఇంజనీర్లను ప్రమాదాలకు బాధ్యులను చేసి నాన్ బెయిలబుల్ కేసులతో జైలుకు పంపుతామని వార్నింగ్ ఇచ్చారు. దేశంలో రోడ్డు ప్రమాద మరణాలను 2030 నాటికి సగానికి తగ్గించాలని రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. 2023లో రోడ్డు ప్రమాదాల మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం దేశంలో మొత్తం 5 లక్షలకు పైగా ప్రమాదాలు జరిగాయని అన్నారు. ఫలితంగా 1,72,000 మంది ప్రాణాలు కోల్పోయారని, మరణాల రేటు 66.4 శాతంగా ఉందన్నారు. అందులో 1,14,000 మంది 18 నంచి 45 ఏళ్ల మధ్య వయస్సు గలవారు కాగా, 10 వేల మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారని నితిన్ గడ్కరీ వెల్లడించారు.