- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
సీఎం సిద్ధరామయ్య పై జేడీ(ఎస్) నేత కుమారస్వామి ఫైర్

బెంగళూరు : బీజేపీతో పొత్తు పెట్టుకున్నందుకుగానూ తమ పార్టీకి ఉన్న లౌకిక అర్హతలను ప్రశ్నించిన ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై జేడీ(ఎస్) నేత హెచ్డీ కుమారస్వామి మండిపడ్డారు. గతంలో మహారాష్ట్రలో బీజేపీకి మిత్రపక్షం గా వ్యవహరించిన శివసేనతో.. ఇప్పుడు కాంగ్రెస్ ఎలా పొత్తు పెట్టుకుందో తెలుసుకోవాలని సీఎంకు సూచించారు. ‘‘సెక్యులర్ అనే ట్యాగ్లైన్తో కుల సమావేశాలను నిర్వహించి కుక్కర్లు, ఐరన్బాక్స్లను పంపిణీ చేయడం లౌకికవాదమా ? మతాల సదస్సులు, కులతత్వ సమావేశాలను నిర్వహించడం సెక్యులర్ అవుతుందా ? మీరు మైనారిటీలు, బీసీలకు నాయకుడా చెప్పండి ?’’ అంటూ కుమారస్వామి ట్విట్టర్ వేదికగా సిద్ధరామయ్యపై ప్రశ్నల వర్షం కురిపించారు. ‘‘సిద్ధరామయ్య ఒక నకిలీ సోషలిస్టు. సోషలిజం అనే పదాన్ని రాజకీయ ప్రయోజనం కోసం వాడుకునేందుకు ఆయన బీజేపీకి మతతత్వ పార్టీగా ముద్ర వేసే ప్రయత్నం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. బీజేపీ బీ టీమ్ గా పేరొందిన కొన్ని పార్టీలతో కలిసి ఇండియా కూటమిని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ కు సెక్యులర్ అనే పదం గురించి మాట్లాడే అర్హత లేదన్నారు.