Kharge: కవచ్ యాంటీ కొలిజన్ సిస్టమ్‌ను వెంటనే ఇన్‌స్టాల్ చేయాలి!.. ఏఐసీసీ చీఫ్ ఖర్గే డిమాండ్

by Ramesh Goud |
Kharge: కవచ్ యాంటీ కొలిజన్ సిస్టమ్‌ను వెంటనే ఇన్‌స్టాల్ చేయాలి!.. ఏఐసీసీ చీఫ్ ఖర్గే డిమాండ్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఈ ప్రమాదాలకు రైల్వే మంత్రి బాధ్యత వహించాలని, భారతదేశం అంతటా కవచ్ యాంటీ కొలిజన్ సిస్టమ్ ను వేగంగా ఇన్‌స్టాల్ చేయాలని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. దిబ్రూగఢ్ ఎక్స్ ప్రెస్ ప్రమాదం పై ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన బీజేపీ ప్రభుత్వంపై పలు విమర్శలు చేశారు. ఈ సందర్భంగా ఖర్గే.. యూపిలో చండీగఢ్-దిబ్రూగఢ్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పడం, మోడీ ప్రభుత్వం క్రమపద్ధతిలో రైలు భద్రతను ఎలా ప్రమాదంలోకి నెట్టిందో చెప్పడానికి మరొక ఉదాహరణ అని ఆరోపించారు.

మృతుల కుటుంబాలకు మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ.. ప్రమాదంలో గాయపడిన వారి కోసం ప్రార్థిస్తున్నామన్నారు. అలాగే ఒక నెల క్రితం, సీల్దా-అగర్తలా కాంచన్‌జంగా ఎక్స్‌ప్రెస్‌ను గూడ్స్ రైలు ఢీకొనడంతో 11 మంది ప్రాణాలు కోల్పోయారని, ఆ సమయంలో రైల్వే భద్రతా కమిషనర్ ప్రమాదం వింతగా స్పందించారని తెలిపారు. ఆటోమేటిక్ సిగ్నల్ వైఫల్యం, నిర్వహణ కార్యకలాపాలలో బహుళ స్థాయిలలో లోపాలు, లోకో పైలట్, రైలు మేనేజర్‌తో వాకీ-టాకీ వంటి క్లిష్టమైన భద్రతా పరికరాలు అందుబాటులో లేకపోవటం ప్రమాదం జరగాడానికి ముఖ్య కారణాలు అని ప్రోబ్ నివేదికలో వెల్లడైందని తెలిపారు.

ఇక ప్రధాని నరేంద్రమోదీ, స్వీయ- ప్రచారం కోసం ఎటువంటి అవకాశాన్ని వదిలిపెట్టని అతని రైల్వే మంత్రి, భారతీయ రైల్వేలను పీడిస్తున్న భారీ లోపాలకు ప్రత్యక్ష బాధ్యత వహించాలని అన్నారు. మా ఏకైక డిమాండ్ ఇదేనని చెబుతూ.. మెరుగైన భద్రతా చర్యలను నిర్ధారించడానికి మరియు ప్రమాదాలను నివారించడానికి భారతదేశం అంతటా అన్ని మార్గాల్లో కవాచ్ యాంటీ-కొలిజన్ సిస్టమ్‌ను వేగంగా ఇన్‌స్టాల్ చేయాలని ఖర్గే డిమాండ్ చేశారు.



Next Story