రేపే జగన్నాథుడి రత్న భండార్ ఓపెన్..46ఏళ్ల తర్వాత తెరవనున్న అధికారులు

by vinod kumar |
రేపే జగన్నాథుడి రత్న భండార్ ఓపెన్..46ఏళ్ల తర్వాత తెరవనున్న అధికారులు
X

దిశ, నేషనల్ బ్యూరో: ఒడిశా పూరీలోని జగన్నాథ ఆలయంలోని రత్న భండార్ ఆదివారం తెరుచుకోనుంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆలయాన్ని ఓపెన్ చేయనున్నట్టు అధికారులు వెల్లడించారు. దీనిని తెరచిన తర్వాత ఆలయంలోని అభరణాలు, ఇతర విలువైన వస్తువులను లెక్కించనున్నారు.16 మంది సభ్యులతో కూడిన ఉన్నత స్థాయి కమిటీ పూరీలోని జగన్నాథ ఆలయ ఖజానాను తెరవాలని సూచించింది. ఆలయ రత్నాల దుకాణాలపై విచారణ జరిపి, అక్కడ ఉంచిన నగలు, విలువైన వస్తువులపై ఆడిట్ చేయాలని సిఫార్సు చేసింది. ఈ నేపథ్యంలోనే దానిని జూలై 14న తెరవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రత్న భండార్ లోపల విలువైన వస్తువులను స్పష్టంగా చూసేందుకు వీలుగా తగిన లైటింగ్ ఏర్పాట్లు చేశారు. ‘రత్న భండార్‌ను తిరిగి తెరవడానికి మేము పూర్తిగా సిద్ధంగా ఉన్నాం. ప్రభుత్వం జారీ చేసిన నిబంధనలకు కట్టుబడి ఉన్నాం’ అని పూరి జిల్లా కలెక్టర్ సిద్ధార్థ్ శంకర్ స్వైన్ వెల్లడించారు. కాగా, జగన్నాధుడి రత్నభాండాగారంను 46 ఏళ్ల తర్వాత ఓపెన్ చేయడం గమనార్హం. దీనిని చివరి సారిగా 1978లో తెరిచారు.

Advertisement

Next Story

Most Viewed