- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
PM Modi: ఆరోజు కోసం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను

దిశ, వెబ్డెస్క్: జమ్మూకశ్మీర్(Jammu and Kashmir) గందర్బల్ జిల్లాలోని సోన్మార్గ్(Sonmarg) ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వం భారీ టన్నెల్ను నిర్మించింది. ఈ టన్నెల్ (Z-Morh Tunnel) పనులు దాదాపు పూర్తి కావొచ్చాయి. సోమవారం ప్రధాని నరేంద్ర మోడీ ఈ టెన్నెల్ను ప్రారంభించనున్నారు. ఈ క్రమంలోనే జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఓమర్ అబ్దుల్లా శనివారం సోన్ మార్గ్ టన్నెల్ పనులను పరిశీలించారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా(X) వేదికగా పంచుకున్నారు.
‘ప్రారంభానికి సిద్ధంగా ఉన్న సోన్మార్గ్ టన్నెల్(Sonmarg Tunnel)ను సందర్శించాను. సందర్శకుల కోసం ఏడాది పాటు ఈ సోన్ మార్గ్ టన్నెల్ తెరిచే ఉంటుంది. ఈ ప్రాంతాన్ని స్కీ రిసార్ట్గా అభివృద్ధి చేయడానికి పనులు ప్రారంభించడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది. శీతాకాలంలో ఇక్కడి ప్రజలంతా ఇకపై ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు. శ్రీనగర్ నుండి కార్గిల్/లేహ్కి ప్రయాణ సమయం కూడా ఆదా కానుంది’ అని ఓమర్ అబ్దుల్లా పేర్కొన్నారు. ఓమర్ అబ్దుల్లా ట్వీట్కు ప్రధాని మోడీ స్పందించారు. ‘సొరంగ మార్గం ప్రారంభంతో పాటు కశ్మీర్లోని సోన్మార్గ్లో పర్యటించడానికి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను’ అని పేర్కొన్నారు.